తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నేతలతో ప్రస్తుత దేశ, రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ నేతలతో చర్చించనున్నారు. గోద్రాలోని 2వేల మంది నరమేధాన్ని మరువలేమని తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పుల్వామా దాడి వెనుక అనుమానాలున్నాయని మమతా బెనర్జీ ఆరోపణలు చేశారన్నారు. ఎన్నికల ముందు కావాలనే దాడి చేయించారనే పశ్చిమబెంగాల్ సీఎం మమత అనుమానం వ్యక్తం చేశారు. దేశం కోసం కట్టుబడి ఉంటామని… దేశ భద్రతకు ఐక్య పోరాటానికి వెనుకాడమని అన్నారు. సైనికులకే మన మద్దతు కానీ నరేంద్ర మోడీ ఏమైనా చేయగల సమర్ధుడని చంద్రబాబు అన్నారు.