మోటారు సైకిళ్లు, వాహనాలు దొంగలపాలు కాకుండా ఉపయోగపడే రిమోట్ అలారం, తాళాలను.. అభివృద్ధి పరిచిన విధ్వంసక పరికరాల(ఐఈడీ)ను పేల్చడానికి ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారని తేలింది. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలోనూ సీర్పీఎఫ్ జవాన్లను చంపడానికి ఇలాంటి తాళాలనే వినియోగించినట్లు భారత దర్యాప్తు సంస్థలు విశ్వసిస్తున్నాయి.