రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతాప్గఢ్ జిల్లా అంబవాలిలో జనాలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలంలోనే తొమ్మిది మంది మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో నలుగురు మృతిచెందినట్టు ప్రతాప్గఢ్ ఎస్పీ అనిల్కుమార్ బేనివాల్ వెల్లడించారు. ప్రతాప్గఢ్ - జైపూర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో 15 మంది గాయపడినట్టు ఆయన తెలిపారు. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.