హైదరాబాద్: వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్కు చెందిన మరో నేత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు లోటస్పాండ్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో ఆమె భేటీ కానున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టెక్కలి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ కిల్లి కృపారాణి 2004, 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2004లో ఓటమి చెందగా 2009 ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర మంత్రి వర్గంలో ఐటీ, కమ్యునికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.