ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 02:11 AM

ఏపీ, తెలంగాణాల్లో ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఇరు రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల చేస్తుండగా, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 28వ తేదీ గా ఖరారు చేశారు. మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలన, 5న ఉపసంహరణకు తుది గడువు. 12 న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంలకు కౌంటింగ్ చేస్తారు. మార్చి 15 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనున్నది. 
ఖాళీ అవుతున్న స్థానాలు ఇవే : ఏపీలో పీ. నారాయణ, ఎ.లక్ష్మీ శివకుమారి, పీ.శమంతక మణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు పదవీకాలం పూర్తవుతోంది. తెలంగాణలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహ్మద్ సలీం, టీ.సంతోష్ కుమార్, మహ్మద్ మహమూద్ అలీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com