ఏపీ, తెలంగాణాల్లో ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఇరు రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల చేస్తుండగా, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 28వ తేదీ గా ఖరారు చేశారు. మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలన, 5న ఉపసంహరణకు తుది గడువు. 12 న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంలకు కౌంటింగ్ చేస్తారు. మార్చి 15 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనున్నది.
ఖాళీ అవుతున్న స్థానాలు ఇవే : ఏపీలో పీ. నారాయణ, ఎ.లక్ష్మీ శివకుమారి, పీ.శమంతక మణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు పదవీకాలం పూర్తవుతోంది. తెలంగాణలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహ్మద్ సలీం, టీ.సంతోష్ కుమార్, మహ్మద్ మహమూద్ అలీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.