శ్రీశైలంలో ఈనెల 25 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లుపై కర్నూలు, ప్రకాశం, జిల్లాల అధికారులతో కర్నూలు కలెక్టర్ సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పాతాళగంగలోని స్నానపు ఘాట్లదగ్గర ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను ఎర్పాటు చేయాలని సూచించారు. అడవి మార్గంలో నడకదారిన వచ్చే భక్తులకు మంచినీరు ఆహారం అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని చెప్పారు. ఆత్మకూరు నుంచి అటవి మార్గంలో మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు.