బీసీ సభలో వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తమ నివాసం నుంచి సోమవారం పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తెదేపాకు వెన్నుదన్ను బీసీలే అని, అది వైకాపాకు మింగుడు పడడం లేదని విమర్శించారు. బీసీ సబ్ప్లాన్కు తామే చట్టబద్ధత కల్పించామని, మళ్లీ చట్టబద్ధత కల్పిస్తామని జగన్ అనడం అవగాహన రాహిత్యానికి నిదర్శమని వ్యాఖ్యానించారు. జయహో బీసీ సభ పెట్టి విజయవంతం చేయడం చూసి జగన్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారని వ్యాఖ్యానించారు. హడావుడిగా సభ పెట్టి జగన్ ఏది పడితే అది మాట్లాడారన్నారు. జగన్కు కన్నా లక్ష్మీనారాయణ అద్దె మైకు అని విమర్శించారు. ఎన్నికల కౌంట్డౌన్ ప్రారంభమైందని నేతలతో సీఎం అన్నారు. ఉత్తమ బృందాన్ని ఎంపిక చేస్తున్నామని చెప్పారు. అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. వైఎస్ పాలనలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. తెదేపా పాలనలో కౌలు రైతుల్లో పూర్తి భరోసా ఉంటుందని, వారి కుటుంబానికి రూ.15వేల చొప్పున ఇస్తున్నామని వెల్లడించారు.