దేశ రక్షణ కోసం అశువులు బాసిన వీర సైనికుల మరణం దేశంలోని ప్రతి భారతీయుడ్ని కలచివేసిందని కోరాడ ఫౌండేషన్ ఛైర్మన్ కోరాడ విజయ్కుమార్ అన్నారు. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో మరణించిన భారత సైనికులకు నివాళులు అర్పిస్తూ కోరాడ విజయ్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం దుర్గాఘాట్ సమీపంలోని పిండప్రదానాల ఘాట్లో హిందూమత ఆచారం ప్రకారం.. పురోహితుల పర్యవేక్షణలో శాస్త్రోక్తకంగా పిండ ప్రదానం గావించారు. అనంతరం కోరాడ విజయ్కుమార్ మాట్లాడుతూ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతిఒక్కరూ ప్రార్థించాలన్నారు. దేశ సైనికులను బలిగొన్న ముష్కరులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాలకులకు ఇదే సరైన సమయం అన్నారు. మరణించిన సైనికుల కుటుంబాలకు మానసిక స్థైర్యం పెంపొందించేలా భగవంతుడు వారికి ఆ శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.