తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైకాపాలో చేరారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన ఆయన వైకాపా అధినేత జగన్తో సోమవారం భేటీ అయి పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవలే వైకాపాలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్తో కలిసి లోటస్పాండ్లోని జగన్ నివాసంలో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపాలో చేరడం తనకు పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబుతో రాష్ట్రానికి ఏమీ రావన్నారు. ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే మేలు చేస్తోందని ఆరోపించారు. తనకు తెదేపా ఎంపీ సీట్ ఇవ్వకపోవడంతోనే వైకాపాలో చేరుతున్నాననేది అబద్దమని ఆయన కొట్టిపారేశారు.