అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం కోరుతూ వచ్చిన ఆశావహుల్లో గిరిజన యువతీ యువకులు గణనీయంగా ఉన్నారు. గిరిజన సంక్షేమానికి జనసేన అండగా ఉంటుందని, అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తామని జనసేన అధ్యక్షులుపవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం, పోరాటయాత్రలో భాగంగా అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో విడిది చేసి గిరిజనులతో మమేకమైన విధానం తమను ఈ పార్టీ వైపు నడిపించాయని వారు తెలిపారు. గిరిజనులపై నిజమైన ప్రేమ ఉన్నది పవన్ కల్యాణ్ గారికే అని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలకు సరైన పరిష్కారం జనసేన పాలనలో లభిస్తుందని చెప్పారు. ఈ ఐదు రోజుల్లో స్క్రీనింగ్ కమిటీ ముందుకు పలువురు అడవిబిడ్డలు తరలి వచ్చి రిజర్వ్డ్ స్థానాల్లో తమ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు. సోమవారం ఒక్క రోజే 45 బయోడేటాలు గిరిపుత్రుల నుంచి వచ్చాయి. వీరిలో ఎక్కువమంది పీజీ, వృత్తి విద్యలు అభ్యసించినవారు ఉన్నారు.