ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేసిన మాదిరిగా సంక్షేమ ఫలాలు మాదిగలకు, ఆయా ఉప కులాలకు చేరే అవకాశం కల్పిస్తూ, జీఓ నెంబర్ 65 జారీ చేసినందుకు మాదిగ, ఉప కులాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జీఓ మాదిగలకు ఓ పెద్ద వరంగా పేర్కొన్నారు. ఇది సాహసోపేత నిర్ణయంగా వర్ల పేర్కొన్నారు. ఎంపీ పందుల రవీంద్ర నీడనిచ్చే చెట్టుని నరుక్కున్నారన్నారు. ఎండమావులను చూసి నీళ్లనుకున్నారని విమర్శించారు.