పరిశ్రమలు, వాణిజ్య శాఖ నుంచి లిడ్క్యాప్ (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ను విడదీసి సాంఘీక సంక్షేమ శాఖలో విలీనం చేసినందుకు మంత్రి జవహర్, ఆర్టీ చైర్మన్ వర్ల రామయ్య, శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్, లిడ్క్యాప్ చైర్మన్ ఎరిక్సన్బాబు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెలగపూడి సచివాలయంలో సోమవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడారు. కొత్తగా జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 65 ప్రకారం మాదిగ, మాదిగ ఉప కులాలకు ఆయా వర్గాల జనాభా దామాషా ప్రకారం సహాయం చేయడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి జవహర్ తెలిపారు. అమలాపురం ఎంపీ పందుల రవీంద్ర ముందు తన ఇంటి పేరుపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆయన ప్రవర్తన తల్లిపాలు త్రాగి రొమ్ము గుద్దినట్లు ఉందని విమర్శించారు. ఆయన చంద్రబాబు నాయుడుని విమర్శించడాన్ని దృష్టిలో పెట్టుకొని సూర్యుడిపై ఉమ్మివేస్తే తన మీదే పడుతుందన్నారు.