భవానీపురం బరంపార్కులో ఆంధ్రప్రదేశ్ టూరిజం, ఫైర్ఫీల్డ్ మరియాట్ హాోటల్ (విశాఖపట్నం) ఆధ్వర్యంలో తయారు చేసిన బ్యాంబు చికెన్ (వెదురు కోడి) పలువురు మాంసాహార ప్రియులను నోరూరించి, కనువిందు చేసింది. ఇంతవరకూ దేశంలోనే ఎవరూ సాధించని అతిపెద్ద బ్యాంబో చికెన్ను సోమవారం హరిత బరంపార్కులోని మారియాట్ హాోటల్ నిపుణుతో తయారుచేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో ఎ.పి. టూరిజం రికార్డు నెకొల్పింది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డును ఢల్లీికి చెందిన జడ్జి శాంతన్ చౌహాన్ చేతులమీదుగా ఎపి టూరిజం శాఖ ఇ.డి. టి.హెచ్.ఎస్.జి. కుమార్, చీప్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, మారియాట్ హాోటల్ నిర్వాహకులు అవార్డును అందుకున్నారు.
15 అడుగు ఈ బ్యాంబూ (వెదురు బొంగు)ను పై భాగం కట్ చేసి దానిలో అన్నిరకాల పదార్థాలు కలిపి తయారుచేసిన చికెన్ను అమర్చి, ఆ బొంగును కవర్చుట్టి, వేడి మంటపై కాల్చారు. ఇలా వెదురు బొంగుతో తయారు చేసిన చికెన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డును అందుకుంది. ఏపి టూరిజం శాఖ భారతదేశంలోనే ఎవరూ చేయని ఘనత సాధించిందని టూరిజం ఇ.డి.కుమార్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి, విశాఖపట్నంలోని ఆరకు వ్యాలీ ప్రాంతాలల్లో ఈ వెదురు బొంగు చికెన్కు ప్రసిద్ధి. ఒక కిలో బ్యాంబు చికెన్లో 223.99 గ్రాముల ప్రొటీన్లు, 27.22 గ్రాములల కార్బోహ్రైడేడ్, 9.72 గ్రాము ఫైబర్, 117.985 కొవ్వు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ జడ్జి శాంతన్ చౌహాన్ మాట్లాడుతూ నేడు మారుతున్న ఆహార రుచులల్లో బ్యాంబు చికెన్ మంచి పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు. టూరిజంకు వచ్చే యాత్రికుకు ఇలాంటి రుచికరమైన ఆహారాన్ని అందించే ప్రయత్నంలో టూరిజం శాఖ, వైజాగ్కు చెందిన మారియా హాోటల్ విజయం సాధించాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎ స్టేట్ ఆఫీసర్ శివరావ్, ఇ.డి. బిఐటిసి ఉమామహేశ్వరరావు, టూరిజం రిప్రజేంటేటివ్ (యూరఫ్) జైకుమార్ తదితరులు పాల్గొన్నారు.