అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లుగా జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పాలన లో తీసుకొచ్చిన మార్పులు తెలియచేశారు. టెక్నాలజీ సహాయంతో ప్రజలకు మెరుగైన సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఐటీ రంగం అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి, గ్రామాలకు టెన్ స్టార్ రేటింగ్, వివిధ శాఖలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం ద్వారా చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి లోకేష్ వివరించారు.