హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె)లో కులభూషణ్ జాదవ్ కేసుపై భారత విదేశాంగ శాఖ వాదనలు ప్రారంభించింది. జాదవ్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రాథమిక ఆధారాలు కూడా బైటపెట్టలేదని భారత్ ఆరోపించింది. గూఢచర్యం కేసులో కులభూషణ్ జాదవ్కు పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై భారత్ ఐసిజెను ఆశ్రయించింది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని భారత్ కోర్టుకు తెలిపింది.