హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం ఎంపీ పి. రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీని వీడారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోటస్పాండ్లోని జగన్ నివాసానికి ఎంపీ రవీంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా రవీంద్రబాబుకు జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అవంతి శ్రీనివాస్తో కలిసి రవీంద్రబాబు జగన్ నివాసానికి వచ్చారు.