న్యూఢిల్లి : మాంసాన్ని ఎగుమతి చేయడం కోసం జంతువులను వధించడాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. జంతువులకు జీవించే హక్కు ఉందని, మాంసాన్ని ఎగుమతి చేసేందుకు వాటిని వధించడం ‘జంతువుల పట్ల క్రూరత్వ నివారణ చట్టా’నికి వ్యతిరేకమని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు.