న్యూఢిల్లి : మాజీ క్రికెటర్, సస్పెన్షన్కు గురైన బిజెపి నాయకుడు కీర్తి ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కీర్తి ఆజాద్ గత వారమే కాంగ్రెస్లో చేరాల్సి ఉండగా, పుల్వామా ఘటన కారణంగా అది వాయిదా పడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశానని మిథిలా సంప్రదాయం ప్రకారం ఆయనను సత్కరించానని ఆజాద్ పేర్కొన్నారు.