చెన్నై : రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కాశ్మీర్ అంశంపై వ్యాఖ్యానించి వివాదానికి తెర లేపారు. పుల్వామా ఘటన జరిగిన నేపథ్యంలో దేశమంతా పాక్పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో కమల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాశ్మీర్లో ప్లెబిసైట్ ఎందుకు నిర్వహించరని కమల్ వ్యాఖ్యానించారు. ఇది వివాదాస్పదమైంది.