న్యూఢిల్లి : ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు పుదుచ్చేరికి చేరుకుని ముఖ్యమంత్రి నారాయణ స్వామితో సమావేశం కానున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆమోదించకపోవడంతో నారాయణ స్వామి తన మంత్రివర్గ సహచరులతో సహా గవర్నర్ నివాసం వద్ద దీక్ష చేస్తున్నారు. ఢిల్లి సిఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నేడు నారాయణ స్వామితో సమావేశమవుతారని ఢిల్లి ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు.