న్యూఢిల్లి : పుల్వామా ఘటనకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన ప్రదర్శన సమయంలో కాశ్మీర్కు చెందిన ఒక యువకుడు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీనితో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిని అబిద్ హుస్సేన్ (28)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని న్యూఢిల్లి డిసిపి మాధుర్ వర్మ చెప్పారు.