ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈనె 20వతేదీన నెల్లూరు నగరంలో పర్యటించనున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన నెల్లూరు నగరంలోని రామయ్యబడి 41, 42 వార్డుల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ 20న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఎన్టీఆర్ నక్లెస్రోడ్డు ఘాట్ ప్రారంభోత్సవం జరగనుందన్నారు.