పాకిస్తాన్పై ఒత్తిడి పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యూహం రచిస్తోంది. ఆర్థిక. దౌత్యపరమైన మార్గాల్లో ఒత్తిడి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో పాక్పై సైనికపరమైన చర్యల దిశగానూ కేంద్రం ఆలోచిస్తోంది. ఉగ్ర నిర్మూలనపై ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టాలని భారత్ నిర్ణయించింది. అంతర్జాతీయంగా పాక్ను ఏకాకిని చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. సింధు జలాల ఒప్పందం పక్కన పెట్టే అంశాన్ని కూడా భారత్ పరిశీలిస్తోంది. తీవ్రవాదానికి పాక్ ఊతమిస్తోందని పలు దేశాలు గుర్తించాలని భారత్ పేర్కొంది. చర్చల విషయంలో పాక్కు చిత్తశుద్ధి లేదని, ఇమ్రాన్ ప్రభుత్వ వైఖరి ప్రపంచ దేశాలకు తెలిసిందని భారత్ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్లో ఎంబసి మూసివేతపై భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.