ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ అకారణంగా తనను వేధిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా అన్నారు. తనకు సంబంధించిన ఆస్తులను ఇ.డి. అధికారులు జప్తు చేయడంపై వాద్రా పైవిధంగా స్పందించారు. వాద్రాకు చెందిన 4.62 కోట్ల రూపాయిల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఇ.డి. ప్రకటించిన తరువాత వాద్రా మాట్లాడుతూ తనను ఇ.డి. ”కాఠిన్యపూరిత వేధింపుల”కు గురి చేస్తోందని అన్నారు.