ఉగ్రవాదం, మిలిటెన్సీల నిర్మూలన కార్యక్రమంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. పుల్వామా ఘటనపై తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆజాద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో అనేక అంశాల్లో తమకు భేదాభిప్రాయాలున్నాయని ఆయన చెప్పారు. అయితే ఉగ్రవాదం, మిలిటెన్సీల నిర్మూలన కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆయన చెప్పారు.