రాయ్పూర్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం నాడు ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఆదివాసి కృషక్ అధికార్ సమ్మేళన్లో రాహుల్ పాల్గొంటారు. ధురాగావ్లో జరిగే కార్యక్రమంలో టాటా స్టీల్ ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చిన రైతులకు భూమి పట్టాలను పంపిణీ చేస్తారు. అటవీ హక్కుల సర్టిఫికెట్లు, రైతు రుణ మాఫీ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. బస్తర్ డివిజన్లో 21.75 కోట్ల రూపాయిలతో చేపట్టిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.