ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్సార్‌సీపీలో చేరిన ఆళ్లగడ్డ టీడీపీ నేత రాంపుల్లారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 02:29 PM

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీకి కర్నూల్‌ జిల్లాలో భారీ షాక్‌ తగిలింది. ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ సీనియర్‌ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఆయన సోదరుడు ప్రతాప్‌ రెడ్డి.. వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి ఇరిగెల బ్రదర్స్‌ వచ్చారు. ఈ సందర్భంగా జగన్‌ సమక్షంలో వారిద్దరితో పాటు మరికొంత మంది నేతలు వైసీపీలో చేరారు. ఇరిగెల బ్రదర్స్‌కు జగన్‌ వైపీసీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిపై ఇరిగెల కుటుంబం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో పలుమార్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన ఇరిగెల బ్రదర్స్‌ ఇవాళ వైసీపీలో చేరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com