హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి కర్నూల్ జిల్లాలో భారీ షాక్ తగిలింది. ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఆయన సోదరుడు ప్రతాప్ రెడ్డి.. వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోటస్పాండ్లోని జగన్ నివాసానికి ఇరిగెల బ్రదర్స్ వచ్చారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో వారిద్దరితో పాటు మరికొంత మంది నేతలు వైసీపీలో చేరారు. ఇరిగెల బ్రదర్స్కు జగన్ వైపీసీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిపై ఇరిగెల కుటుంబం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో పలుమార్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన ఇరిగెల బ్రదర్స్ ఇవాళ వైసీపీలో చేరారు.