రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ ఓ డ్రామా కంపెనీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈరోజిక్క ఆయన మాట్లాడుతూ చంద్రబాబులా మేం రోజుకో వేషం వేయలేమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఏపీలో ఎందుకు వదిలేశారు? అని ప్రశ్నించారు. స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధమన్నారు. ప్యాకేజీని సమర్థించిన తీర్మానాలను అసెంబ్లిd రికార్డుల నుంచి తొలగించారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.