ధైర్యమున్న వాళ్లే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… గెలుస్తామనే ధైర్యం ఉంది కాబట్టే రాజీనామాలు చేశారన్నారు. ఇప్పటికే ఇద్దరు రాజీనామాలు చేశారన్నారు. మిగిలిన వాళ్లు రాజీనామా చేస్తారో చేయరో వాళ్ల వ్యక్తిగతమన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఎమ్మెల్సీల రాజీనామాపై పార్టీదే నిర్ణయమన్నారు. అవంతి, ఆమంచి పార్టీ మారి కాపు ద్రోహులయ్యారన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఉండవని చెప్పిన వైకాపాలోకి ఎళా వెళ్లారని చినరాజప్ప ప్రశ్నించారు.