ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయం : బైరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 12:04 PM

కడప : 80 రోజుల్లో మోడీ ప్రధానిగా ఓడిపోవడం, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ…. మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. మోడీ పాలనను అంతం చేయాలని ప్రజలు సిద్ధమయ్యారన్నారు. చంద్రబాబు నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు మోడీపై యుద్ధం అంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో పార్టీలను కలుపుతున్నామని ప్రచారం చేస్తున్నారని, రాహుల్ గాంధీ ప్రధాని అయిన తరువాత మొదటి సంతకం హోదా పైనే అన్నారు. చంద్రబాబు అన్ని రంగాల్లో విఫలమయ్యారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com