విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. చినజీయర్ స్వామికి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని చినజీయర్స్వామికి దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ, చైర్మన్ గౌరంగబాబు అందజేశారు.