ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభ్యత్వం తీసుకోవడం ద్వారా టీడీపీ కార్యకర్తనని ఘనంగా చాటాలని లోకేష్ పిలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 02:52 PM

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వివరాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా... పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది అని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రూ.100తో టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్య, ఉద్యోగ, వైద్య సదుపాయం అందుతుందని వివరించారు. దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీ చేయని రీతిలో కార్యకర్తల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన చరిత్ర మన తెలుగుదేశం పార్టీది అని లోకేశ్ పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకోండి... తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని ఘనంగా చాటండి అంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. టీడీపీ సభ్యత్వాన్ని మొబైల్ లేదా కంప్యూటర్ పై వాట్సాప్ ద్వారా https://bit.ly/4eK2Lj5 లింక్ ను ఉపయోగించి పొందవచ్చని, లేదా https://telugudesam.org/membership-2024-26/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్లోనే తీసుకోవచ్చని లోకేశ్ వివరించారు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com