ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పవన్ కల్యాణ్ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 04:10 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు (అక్టోబరు 21) విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పర్యటించనున్నారు. గుర్ల గ్రామంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో, పవన్ ఆ గ్రామానికి వెళ్లి స్థానిక పరిస్థితులపై అధికారులతో సమీక్షిస్తారు. గ్రామంలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. గత కొన్నిరోజులుగా విజయనగరం జిల్లాలోని మండలకేంద్రమైన గుర్ల గ్రామంలో డయేరియా విజృంభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఒక్కరోజులోనే నలుగురు మృతి చెందడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీశారు. ఈ క్రమంలో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా పరిస్థితులను సమీక్షించనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com