ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ ఏఈవోగా వెంకయ్య చౌదరి,,,,ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 10:10 PM

టీటీడీకి అదనపు ఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వెంకయ్య చౌదరి 2005 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కాగా.. డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిది. దీంతో ఈ నెల 16న కేంద్రం ఆమోదం తెలపగా.. ఆయన ఈ నెల 22న ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆయన్ను టీటీడీ అదనపు ఈవోగా నియమించడంతో పాటు తిరుమల జేఈవోగానూ విధులు నిర్వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంకయ్య చౌదరి శనివారం ఉదయం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు సమాచారం.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు.. ఆ దిశగా టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. టీటీడీలో శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. లోటుపాట్లను సరిచేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరిని టీటీడీలోకి తీసుకొచ్చారు.


శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29 నుండి ఆగష్టు 7వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. ఆగష్టు 7న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర సంద‌ర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.


సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్‌ క్వార్టర్స లోని గీతామందిరం, ఆర్‌ఎస్‌ మాడ వీధి లోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com