ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల, చెన్నై వెళ్లేఈ రైళ్లు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 08:23 PM

ఏపీలో పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ-గూడూరు మూడో లైన్‌ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. విజయవాడ-న్యూ వెస్ట్‌ బ్లాక్‌ హట్‌ మధ్య ప్రీ నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌, నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు కూడా నడుస్తున్నాయి. ఈ కారణంగానే ఆగస్టు 5 నుంచి 12 వరకు రైళ్లను రద్దు చేశారు. విజయవాడ డివిజన్‌ మీదుగా వెళ్లే 37 రైళ్లను రద్దు చేయగా.. మరో 38 రైళ్లను దారి మళ్లించారు. రైల్వేశాఖ రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.


కడప-విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (17487-88), విజయవాడ-సికింద్రాబాద్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ (12713-14), హుబ్లీ - విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ (17329-30), విజయవాడ-చెన్నై పినాకిని ఎక్స్‌ప్రెస్ (12711), చెన్నై సెంట్రల్‌-విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ (12077-78) రైళ్లు రద్దు చేశారు. డోర్నకల్‌-విజయవాడ (07755), విజయవాడ-డోర్నకల్‌ (07756).. విజయవాడ-భద్రాచలంరోడ్‌ (07979), భద్రాచలంరోడ్‌-విజయవాడ (07278) రైళ్లను ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు.


గుంటూరు-సికింద్రాబాద్‌ (17201), సికింద్రాబాద్‌-గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌.. విజయవాడ-సికింద్రాబాద్‌ (12713), సికింద్రాబాద్‌-విజయవాడ (12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగస్టు 5 నుంచి 10 వరకు రద్దు చేశారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం గోదావరి, సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి, సికింద్రాబాద్‌-గూడూరు సింహపురి, ఆదిలాబాద్‌-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18046) కూడా రద్దు చేశారు.


విశాఖపట్నం-షిర్డీసాయినగర్‌ (18503), షిర్డీసాయినగర్‌-విశాఖపట్నం (18504), విశాఖపట్నం-న్యూఢిల్లీ (20805), న్యూఢిల్లీ-విశాఖపట్నం(20806), విశాఖపట్నం-హైదరాబాద్‌ (12727), హైదరాబాద్‌-విశాఖపట్నం (12728), విశాఖపట్నం-నిజామాబాద్‌ (12803), మచిలీపట్నం-షిర్డీసాయినగర్‌(17208), షిర్డీ సాయినగర్‌-మచిలీపట్నం (17207), విశాఖపట్నం-లోకమాన్యతిలక్‌ టెర్మినల్‌ (18519), లోకమాన్యతిలక్‌ టెర్మినల్‌-విశాఖపట్నం (18520), విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (12739), సికింద్రాబాద్‌-విశాఖపట్నం (12740), విశాఖపట్నం-గాంధీనగర్‌ (20803), గాంధీనగర్‌-విశాఖపట్నం (20804) రైళ్లు రద్దయ్యాయి.


నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ (12787), నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ (12788), మచిలీపట్నం-బీదర్‌ (12749), బీదర్‌-మచిలీపట్నం (12750), హైదరాబాద్‌-షాలిమార్‌ (18046), షిర్డీసాయినగర్‌-కాకినాడ పోర్టు (17205), కాకినాడ పోర్ట్‌-షిర్డీసాయినగర్‌ (17206), షాలిమార్‌-హైదరాబాద్‌ (18045),పూరి-ఓఖా (20819), ఓఖా-పూరి (20820), నిజాముద్దీన్‌- విశాఖపట్నం(12804), ఛత్రపతి శివాజీ టెర్మినల్‌-భువనేశ్వర్‌ (11019), భువనేశ్వర్‌ -ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ (11020), యశ్వంత్‌పూర్‌-టాటా (18112), టాటా-యశ్వంత్‌పూర్‌ (18111), హైదరాబాద్‌-తాంబరం (12760) రైళ్లు రద్దయ్యాయి.


మరోవైపు గుంతకల్‌-బీదర్‌ (07671) ఆగస్టు 1-31 వరకు, , కాచిగూడ-గుంతకల్‌ (07670) ఆగస్టు 2-సెప్టెంబర్‌ 1, కాచిగూడ-రాయచూర్‌ (17693) ఆగస్టు 1-31 వరకు రద్దయ్యాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి.. అందుకు తగిన విధంగా జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వే అదికారులు తెలిపారు. కొన్ని నెలలుగా విజయవాడ డివిజన్ పరిధిలో భారీగా రైళ్లు రద్దవుతున్నాయి.. దీంతో రైలు ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com