భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.2026 టీ20 ప్రపంచకప్నకు జట్టును సిద్ధం చేయాలంటే, ఇక నుంచి యువ ఆటగాళ్లకు వీలైనంత ఎక్కువ అవకాశం ఇవ్వాలి.ప్రతి మ్యాచ్లో ఆడాల్సిన ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.
1. యశస్వి జైస్వాల్.
.టీ20 నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, యశస్వి జైస్వాల్ ఈ ఫార్మాట్లో అతనిని భర్తీ చేయగలడు. కేవలం కొన్ని బంతుల్లోనే మ్యాచ్ను మలుపుతిప్పగల సత్తా అతడికి ఉంది.
2. రింకూ సింగ్..
ప్రతి మ్యాచ్లో తుఫాన్ బ్యాట్స్మెన్ రింకూ సింగ్కు కూడా అవకాశం రావాలి. రింకూ సింగ్కు చాలా సత్తా ఉంది. కానీ, ఇప్పటి వరకు భారత్ అతడిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. రింకూ సింగ్కి ప్రతి మ్యాచ్లో అవకాశం లభిస్తే, అతని ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. భవిష్యత్తులో, అతను ఫినిషర్గా చాలా బలంగా నిరూపించుకోగలడు.
3. రవి బిష్ణోయ్..
రవి బిష్ణోయ్ ఇటీవల జింబాబ్వే టూర్లో ఆడుతూ కనిపించాడు. శ్రీలంక సిరీస్కు భారత జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. రవి బిష్ణోయ్ అద్భుతమైన స్పిన్ బౌలర్. భవిష్యత్తులో భారతదేశానికి పెద్ద సూపర్ స్టార్ కాగలడు. బిష్ణోయ్లోని ప్రత్యేకత ఏమిటంటే, అతను వికెట్లు తీయగలడు, పరుగులను సాధించగలడు