తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిత్రంతో కెరీర్ను ప్రారంభించి అప్పట్లో సినీ పరిశ్రమలో హాట్టాపిక్గా మారాడు. మారుతి ఆ తరువాత దర్శకుడిగా భలే భలే మగాడివోయ్, ప్రతి రోజూ పండుగే, బాబు బంగారం లాంటి హిట్స్ను సాధించాడు. దీంతో పాటు పలు చిత్రాలకు కథా రచయితగా సమర్పకుడిగా కూడా ఆయన వ్యవహరించారు. తాజాగా మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో రాజాసాబ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.