సీతంపేట నూతన ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారిగా టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం భాద్యతలు స్వీకరించిన అనంతరం పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐ టి డి ఎ ప్రాజెక్ట్ పరిధిలోని గిరిజానాభివృద్ధికి కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసిన శుభం బన్సల్ బదిలీపై వెళ్లిన విషయం విదితమే.