వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన పార్టీ కలసి పని చేస్తాయని, మార్చిలో సీట్ల పంపకాల మీద చర్చలు జరుగుతాయంటూ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే, ఈ వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు జనసేన పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీ వదిలేస్తే, రాజ్యసభ సీటు దక్కించుకున్న టీజీ వెంకటేష్ ఇలాంటివి మాట్లాడొద్దని హెచ్చరించారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ‘పెద్ద మనిషిగా తన మర్యాద నిలబెట్టుకోవాలని, టీజీ వెంకటేష్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తాము వామపక్ష పార్టీలతో కలసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.