భువనేశ్వర్ : భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. భార్య అతడి మర్మాంగాలు కోసేసింది. ఈ దారుణ సంఘటన ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో అతనిపై భార్య దాడి చేసి మర్మాంగాలను కోసేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఈ ఘటనకు భార్య పాల్పడిందని తెలిపారు. అయితే తీవ్ర గాయాలపాలైన భర్త కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.