న్యూఢిల్లి : నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో 11 మంది సెయిలర్లు మరణించారు. మరొక ఏడుగురు గల్లంతయ్యారు. క్రిమియాలోని కెర్చ్ స్టెట్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. ఒక ట్యాంకర్ నుంచి మరొక ట్యాంకర్కు ఇంధనాన్ని పంప్ చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. టాంజానియాకు చెందిన ఈ వాణిజ్య నౌకల్లో భారత్, టర్కీలకు చెందిన సిబ్బంది ఉన్నారు.