అమరావతి: ఈవీఎంలపై అంతర్జాతీయంగా సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019పై నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో రుజువులు చూపారన్నారు. ప్రజాస్వామ్యంలో అనుమానాలకు తావులేదన్నారు. ఓటు ఎవరికి పడిందనే సంశయం ఉండకూడదన్నారు. సంశయాత్మక ప్రజాస్వామ్యం చేటుదాయకమని పేర్కొన్నారు. టీడీపీ పోరాటం వల్లే వీవీ ప్యాట్ రశీదులు వచ్చాయని, కానీ రశీదుపై ముద్ర లైట్గా పడుతోందని, పడిన ముద్ర వెంటనే కరిగిపోతోందన్నారు. వీవీ ప్యాట్ కూడా 100 శాతం నియోజకవర్గాల్లో అమలు లేదని పేర్కొన్నారు. వీటన్నింటిపై 22 పార్టీల ప్రతినిధులతో త్వరలోనే ఈసీని కలుస్తామన్నారు. 120 దేశీల్లో ఈవీఎంలను అమలు చేయల్దేదని, 20 దేశీల్లోనే వినియోగం ఉందన్నారు. ఈవీఎంల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలన్నారు.