తాడేపల్లిగూడెం: బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. జిల్లాకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిన్న తాడేపల్లిగూడెంలో మాణిక్యాలరావు నిరవధిక నిరాహారదీక్షను ప్రారంభించారు. హామీలు నెరవేర్చాలంటూ గత నెల 25న మాణిక్యాలరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మాణిక్యాలరావు దీక్షకు దిగారు.