ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ నిధులన్న కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యలు అబద్దమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019పై నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్కే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క బుల్లెట్ రైలుకే రూ.లక్ష కోట్లకు పైగా కేటాయించారన్నారు. ఏపీకి ఇచ్చినవన్నీ టోల్ వసూలు చేసే రహదారులేనన్నారు. ఏపీని ఏదో ఉద్దరించినట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నెలలో చేస్తామని ఏడాది జాప్యం చేశారన్నారు. డీపీఆర్-2 ఆమోదంలో ఏడాది జాప్యానికి గడ్కరీ సమాధానం చెప్పాలన్నారు. ఏ రాష్ట్రానికైనా మోడీ అంగీకారంతోనే నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. కూటమికి నలుగురు ప్రధానులనడం బీజేపీలో భయానికి నిదర్శనమన్నారు. కోల్కతా సభతో బీజేపీ నేతలు బెంబేలెత్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీ వల్ల జరగలేదని, మన స్వయం కృషి వల్లే ఏపీ అభివృద్ధి జరిగిందని అన్నారు. నాలుగేళ్లలో ఏపీ అభివృద్ధి ఘనత టీడీపీదేనన్నారు. ఈ నెల 25న రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో పసుపు-కుంకుమ సభలు నిర్వహిస్తామన్నారు. అమరావతి, విశాఖ, కడపలో మహిళా సదస్సులు నిర్వహిస్తామన్నారు.