న్యూఢిల్లి : బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో బహిరంగ సభలో పాల్గొననున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అయితే అమిత్షా ప్రయాణించే హెలికాప్టర్ మాల్దాలో దిగడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, ఇది అన్యాయమని ఆయన అన్నారు. విమానాశ్రయంలో మరమ్మతులు జరుగుతున్నాయనే నెపంతో అమిత్షా హెలికాప్టర్ దిగడానికి అనుమతి మంజూరు చేయలేదని ఆయన అన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ అక్కడ దిగిందని ఆయన అన్నారు. కొంతమంది జర్నలిస్టులు అక్కడకు వెళ్లారని, తన వద్ద ఫొటోలు ఉన్నాయని ఆయన చెప్పారు. అధికార దుర్వినియోగంతో, అవాస్తవాలు చెబుతూ అమిత్షా హెలికాప్టర్ మాల్దాలో దిగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు.