అమరావతి: అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి మంత్రులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు, అసెంబ్లి సమావేశాలపై సమన్వయ కమిటీ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. అలాగే జయహో బీసీ సభ, అమరావతి ధర్మపోరాట సభపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.