విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బీజేపీకి ఎలాంటి చిన్నచూపు లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలో కృష్ణా జిల్లా బీజేపీ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర స్థితిగతులు ఎంతో మారాయన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్వతంత్ర సంస్థలతో సర్వే తెప్పించుకోండని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు పూర్తి నిధులు కేంద్రమే ఇస్తుందన్నారు. గోదావరి మిగులు జలాలను తమిళనాడుకు అందిస్తామన్నారు.