ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలు, రైతులు దేశానికే ఆదర్శం : నితిన్ గడ్కరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 21, 2019, 12:05 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులు దేశానికే ఆదర్శమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలో కృష్ణా జిల్లా బీజేపీ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ… తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని… తీవ్రవాదానికి మాత్రమే వ్యతిరేకమన్నారు. జాతీయ వాదం బీజేపీ ప్రథమ సూత్రమన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది చెందుతోందన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. విద్య, వైద్యం, ప్రాజెక్టులు ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తున్నా ఇవ్వట్లేదంటున్నారన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు సిద్దమా అని గడ్కరీ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com