న్యూఢిల్లి : ఉత్తర్ ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పి), బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బిఎస్పి) పొత్తును ప్రజలు ఆమోదించరని కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే అన్నారు. ఈ పొత్తు ఎక్కువ కాలం కొనసాగదని ఆయన చెప్పారు. బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి బిజెపి మద్దతుతో మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని ఆయన అన్నారు. దళితల సంక్షేమం కోసం ఆమె పని చేయాలనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీతో జత కలవాలని ఆయన అన్నారు.