ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గండ్లుకొట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 21, 2019, 11:18 AM

గండ్లుకొట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీరు-ప్రగతి’పై సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్లు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రెచ్చగొట్టే ప్రయత్నాలకు రైతులు దూరంగా ఉండాలన్నారు. చిత్తూరులో కుప్పం వరకు నీళ్లు ఇవ్వగలగాలన్నారు. అనంతపురంలో హిందూపురం, మడకశిరకు నీళ్లు చేరాలన్నారు. అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తున్నాం-ప్రగతి సాధిస్తున్నామన్నారు. రాయలసీమ ఆర్థిక స్థితి మెరుగుపడిందని, ఉద్యాన హబ్ గా చేస్తున్నామన్నారు. వెలుగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీటి కొరత అధిగమిస్తామన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం మన లక్ష్యమన్నారు. పంచనదుల అనుసంధానంతో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. లోటు వర్షపాతంలో కూడా దిగుబడులు తగ్గకుండా చూశామని చంద్రబాబు అన్నారు. చిత్తూరు మెట్ట ప్రాంతాలకు నీటి సరఫరా చేయడం ఒక చరిత్ర అని అన్నారు.  రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లి, మదనపల్లికి నీరు చేరితే కరవు అదృశ్యమవుతుందన్నారు. టమాట హబ్ గా చిత్తూరు రూపొందాలన్నారు. సమర్థ నీటి నిర్వహణతోనే పురోగతి సాధించామన్నారు. పట్టిసీమ దండగ అన్నవాళ్లకు సీమకు నీళ్లే సమాధానమన్నారు. సమర్థ నీటి నిర్వహణపై రైతుల్లో అవగాహన కల్పించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com